స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం `అల వైకుంఠపురములో`. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముచ్చటగా మూడవసారి అల్లు అర్జున్తో కలిసి చేస్తున్న చిత్రమిది. ఏవిషయంలోనూ తగ్గకుండా ఈ సినిమాని ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు మాస్ని కూడా ఆకట్టుకునే యాక్షన్ అంశాలతో ఈ చిత్రాన్ని అన్నిరసాల సమ్మేళనంగా త్రివిక్రమ్ వండి వారుస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్ ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. వీటికి తోడు వినసొంపైన పాటలతో కూడా అల వైకుంఠపురములో` రచ్చ చేస్తుండటం పలువురిని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
అల్లు అర్జున్ మాసీవ్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటల్ని ఇప్పటికే రిలీజ్ చేశారు. అందులో సాహిత్య సవ్యసాచి సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన `సామజ వరగమణ…` రికార్డుస్థాయిలో వ్యూస్తో 100 మిలియన్ మార్కుని దాటి సంచలనం సృష్టించింది. ఇక వర్ధమాన గేయ రచయిత కాసర్ల శ్యామ్ రాసిన మాస్ సాంగ్ `రాములో రాములా..` కూడా అదే స్థాయి రికార్డు వ్యూస్ని యూట్యూబ్లో సాధించిన సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో పాటని చిత్ర బృందం రిలీజ్ చేసింది. రామజోగయ్య రాసిన `బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్న సుట్టూ కుంటివే.. జిందగిగే ఆటంబాంబువై జంట కట్టుకుంటివే.. అనే పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అర్మాన్ మాలిక్ పాడిన ఈ పటకు రామజోగయ్య శాస్త్రి అర్ధవంతమైన పదాల్ని అందించారు. తమన్ సంగీతం కూడా ఈ పాటని మరో హిట్ సాంగ్గా మలిచింది. చిత్ర బృందం రిలీజ్ చేసిన మూడు పాటలు ఓ రేంజ్లో వుండటంతో త్రివిక్రమ్ పాటలతో రచ్చ చేయాలని డిసైడ్ అయ్యారా ఏంటి అని అవాక్కవుతున్నారట.