Homeటాప్ స్టోరీస్పాట‌ల‌తో ర‌చ్చ చేయాల‌ని డిసైడ్ అయ్యారా ఏంటీ?

పాట‌ల‌తో ర‌చ్చ చేయాల‌ని డిసైడ్ అయ్యారా ఏంటీ?

పాట‌ల‌తో ర‌చ్చ చేయాల‌ని డిసైడ్ అయ్యారా ఏంటీ?
పాట‌ల‌తో ర‌చ్చ చేయాల‌ని డిసైడ్ అయ్యారా ఏంటీ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ముచ్చ‌ట‌గా మూడ‌వ‌సారి అల్లు అర్జున్‌తో క‌లిసి చేస్తున్న చిత్ర‌మిది. ఏవిష‌యంలోనూ త‌గ్గ‌కుండా ఈ సినిమాని ప్లాన్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌తో పాటు మాస్‌ని కూడా ఆకట్టుకునే యాక్ష‌న్ అంశాల‌తో ఈ చిత్రాన్ని అన్నిర‌సాల స‌మ్మేళ‌నంగా త్రివిక్ర‌మ్ వండి వారుస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఆ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. వీటికి తోడు విన‌సొంపైన పాట‌ల‌తో కూడా అల వైకుంఠ‌పురములో` ర‌చ్చ చేస్తుండ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.

అల్లు అర్జున్ మాసీవ్ పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాట‌ల్ని ఇప్ప‌టికే రిలీజ్ చేశారు. అందులో సాహిత్య స‌వ్య‌సాచి సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి రాసిన `సామ‌జ వ‌ర‌గ‌మ‌ణ‌…` రికార్డుస్థాయిలో వ్యూస్‌తో 100 మిలియ‌న్ మార్కుని దాటి సంచ‌ల‌నం సృష్టించింది. ఇక వ‌ర్ధ‌మాన గేయ ర‌చ‌యిత కాస‌ర్ల శ్యామ్ రాసిన మాస్ సాంగ్ `రాములో రాములా..` కూడా అదే స్థాయి రికార్డు వ్యూస్‌ని యూట్యూబ్‌లో సాధించిన సినిమాపై ఆస‌క్తిని రేకెత్తించాయి.

- Advertisement -

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మ‌రో పాటని చిత్ర బృందం రిలీజ్ చేసింది. రామ‌జోగ‌య్య రాసిన `బుట్ట‌బొమ్మా బుట్ట‌బొమ్మా న‌న్న సుట్టూ కుంటివే.. జింద‌గిగే ఆటంబాంబువై జంట క‌ట్టుకుంటివే.. అనే పాట ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అర్మాన్ మాలిక్ పాడిన ఈ ప‌ట‌కు రామ‌జోగ‌య్య శాస్త్రి అర్ధ‌వంత‌మైన ప‌దాల్ని అందించారు. త‌మ‌న్ సంగీతం కూడా ఈ పాట‌ని మ‌రో హిట్ సాంగ్‌గా మ‌లిచింది. చిత్ర బృందం రిలీజ్ చేసిన మూడు పాట‌లు ఓ రేంజ్‌లో వుండ‌టంతో త్రివిక్ర‌మ్ పాట‌ల‌తో ర‌చ్చ చేయాల‌ని డిసైడ్ అయ్యారా ఏంటి అని అవాక్క‌వుతున్నార‌ట‌.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All