టాలీవుడ్ లో హీరోయిన్లకు ఎప్పుడూ కొరత లేదు. బొంబాయి నుండి ఎప్పటికప్పుడు కొత్త సరుకు దిగుతూనే ఉంటుంది. అయితే వీరిలో చాలా తక్కువమంది మాత్రమే క్లిక్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ లో ముగ్గురి భామల హవా నడుస్తోంది. వారే రాశి ఖన్నా, పూజ హెగ్డే, రష్మిక.
తమన్నా, కాజల్ లాంటి వాళ్ళు పాతబడిపోవడం.. అనుష్క, సమంత సెలెక్టివ్ గా సినిమాలు చేయడంతో రాశి, పూజ, రష్మికలకు ఫుల్ డిమాండ్ వచ్చేసింది. ప్రస్తుతం రష్మిక మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ సుకుమార్ సినిమా, నితిన్ భీష్మ సినిమాలలో నటిస్తూ ఉంది.
మరోవైపు పూజ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రంలో నటిస్తోంది. ప్రభాస్ జాన్ లో కూడా హీరోయిన్ ఈమే. అంతే కాకుండా అఖిల్ – బొమ్మరిల్లు భాస్కర్ చిత్రంలో నటిస్తోంది. రాశి ఖన్నా కూడా తక్కువేం తినలేదు. ప్రస్తుతం ఆమె తెలుగులో వెంకీ మామ, ప్రతిరోజూ పండగే, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో కూడా 2 చిత్రాల్లో నటిస్తోంది. ఇలా ఈ ముగ్గురు హీరోయిన్లు ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలతారు.