Homeటాప్ స్టోరీస్మణిశర్మ స్టూడియోలో నగదు చోరీ

మణిశర్మ స్టూడియోలో నగదు చోరీ

ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మరికార్డింగ్ స్టూడియో లో చోరీ జరిగింది ,దాంతో పోలీసులను ఆశ్రయించాడు మణిశర్మ . హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో మణిశర్మ కు రికార్డింగ్ స్టూడియో ఉంది , కాగా అందులో నాలుగున్నర లక్షలను బీరువాలో దాచిపెట్టి చెన్నై కి వెళ్ళాడు అక్కడ పనులను ముగించుకొని ఈనెల 2న తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు . వచ్చీ రావడంతోనే బీరువాలో దాచిన డబ్బు చూడగా మొత్తం మాయమయింది దాంతో ఖంగుతిన్న మణిశర్మ తన సహాయకుడైన వెంకటేష్ పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించాడు .

కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటేష్ ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు . మణిశర్మ సంగీత దర్శకుడి గా అగ్రశ్రేణి దర్శకుడు అన్న విషయం తెలిసిందే . తెలుగునాట పలు సంచలన విజయాలు అందుకున్న చిత్రాలకు సంగీతం అందించాడు . ఇక మణిశర్మ తనయుడు మహతి సాగర్ కూడా సంగీత దర్శకుడు అయ్యాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All