తనకు స్వల్పంగా కరోనా లక్షణాలు వున్నట్టు తేలిందని, దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చిందిని, తను ఎంజీఎం ఆసుపత్రిలో చేరుతున్నానని బాలు ఆగస్టు 5న ఓ వీడియో సందేశాన్ని నెటిజన్స్తో పంచుకున్నారు. అక్కడి నుంచి ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు షికారు చేస్తూ వచ్చాయి. వాటిని నమ్మొద్దని నాన్న బాగానే వున్నారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ వివరణ ఇస్తూ వచ్చారు.
ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు కూడా ప్రతిరోజు బాలు ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్ని విడుదల చేస్తూ వచ్చాయి. సడెన్గా బాలు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ఆయన ట్రీట్మెంట్కు స్పందించడం లేదని ఆయనకు ఎక్మో ట్రీట్మెంట్ ద్వారా చికిత్స అందిస్తున్నామని, ఆమెరికాకు చెందిన స్పెషలిస్ట్ల బృందం బాలుకు వైద్యం చేస్తున్నారని ఎంజీఎం వర్గాలు చెబుతూ వచ్చాయి. తాజాగా ఉరువారం బాలు ఆరోగ్యం అత్యంత విషమంగా వుందని హెల్త్ బులిటెన్ని విడుదల చేయడంతో బాలు అభిమానులు,సెలబ్రిటీలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు.
గురువారం అర్థ్ర రాత్రి నుంచి ఎంజీఎం ఆసుపత్రి విషాద ఛాయలతో కొంత ఇబ్బందికరంగా కనిపించిందని చెన్నై మీడియా కథనం. బాలు ఆరోగ్య పరిస్థితి తెలిసి కమల్హాసన్ ఆసుపత్రికి చేరుకుని బాలు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారట. ఆ తరువాత ఒక్కొక్కరుగా సెలబ్రిటీలు ఎంజీఎం ఆసుపత్రికి చేరి బాలు కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తుండటం కలకలం రేపుతోంది. ఏ క్షణాన ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని బాలు అభిమానులు దేవుడా బాలుని రక్షించు అంటూ వేడుకుంటున్నారట.