సంచలన దర్శకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన `నువ్వు నేను` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఉత్తరాది చిన్నది అనిత. తొలి సినిమా సూపర్హిట్ కావడంతో తెలుగులో మంచి క్రేజ్ని సొంతం చేసుకుంది. సింధీ ఫ్యామిలీకి చెందిన అనిత ఆ తరువాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. తెలుగులో అనిత నటించిన చివరి చిత్రం `మనలో ఒక్కడు`. ఆర్పీ పట్నాయక్ ఇందులో హీరోగా నటించాడు.
ఈ సినిమా తరువాత తెలుగులో కనిపించకుండా పోయిన అనిత హిందీ సీరియల్స్లో రాణించడం మొదలుపెట్టింది. నాగిన్ 3, నాగిన్ 4 సీరియల్స్తో మంచి క్రేజ్ని సొంతం చేసుకుంది. 2013లో రోహిత్రెడ్డి అనే వ్యాపార వేత్తని వివాహం చేసుకుంది. ఇద్దరూ అన్యోన్యంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి తరువాత కూడా సీరియల్స్లో నటిస్తూనే వుంది.
మరో పక్క హాట్ హాట్ ఫొటోలతో నెటిజన్స్ని కవ్విస్తోంది. తాజాగా అనిత పెట్టిన ఓ ఫొటో నెటిజన్స్ని హీటెక్కిస్తోంది. భర్త రోహిత్రెడ్డితో కలిసి వెకేషన్కి వెళ్లిన అనిత అక్కడ బాత్ టబ్బులో న్యూడ్గా ఫొటోలకు పోజులిచ్చింది. ఆ ఫొటోలని ఇన్స్టాలో పోస్ట్ చేసి తన భర్త ఎలా కావాలనుకున్నాడో.. చివరికి తనని ఎలా ఫొటో తీశాడో అంటూ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.