2020 యావత్ ప్రపంచానికి బ్యాడ్ ఇయర్గా మారింది. ముఖ్యంగా మరీ ప్రధానంగా వినోద పరిశ్రమకు ఒక పీడకలగా మారుతోంది. ఈ సంవత్సరం అత్యధిక మంది నటీనటులు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మరో టీవి నటి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. తమిళ టీవీ నటి వి.జె. చిత్ర చెన్నైలోని నజరేట్పేట్టైలోని ఫైవ్స్టార్ హోటల్లో సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది.
పోలీసుల కథనం ప్రకారం ఇటీవలే యువ వ్యాపారవేత్త హేమంత్తో వి.జె. చిత్రకు నిశ్చితార్థం జరిగింది. ఆమె ఆత్మహత్యకు గురైన హోటల్ గదిలో కాబోయే భర్త హేమంత్ కూడా అదే హోటల్లో ఉందడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఓ సినిమాలో నటిస్తున్న చిత్ర షూటింగ్ను ఈవీపీ ఫిల్మ్ సిటీలో ముగించుకుని తెల్లవారుజామున 2:30 గంటలకు తన హోటల్ గదికి తిరిగి వచ్చింది.
హోటల్కు తిరిగి వచ్చిన తర్వాత తాను స్నానం చేస్తానని చిత్ర తనకు సమాచారం ఇచ్చిందని హేమంత్ పేర్కొన్నాడు. ఆ తరువాత డోర్ కొడితే ఆమె స్పందించలేదని, హోటల్ సిబ్బంది సహాయంతో డూప్లికేట్ కీ తెచ్చి తలుపు తెరిచామని గది తలుపు తెరిచి చూస్తే చిత్ర చనిపోయి వుందని ఏమంత్ చెబుతున్నాడు.
ఫైవ్ స్టార్ హోటల్ మేనేజర్ తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో పోలీసులను పిలిచి ఈ సంఘటన గురించి సమాచారం ఇచ్చారు. అయితే చిత్ర శరీరంపై గాయాలు ఉన్నాయి దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్ మార్టం నివేదిక తరువాత ఏం జరిగిందన్నది బయటపడే అవకాశం వుందని చెబుతున్నారు.