సెన్సార్ కారణంగా కొన్ని చిత్రాలు నెలలు, ఏళ్ల తరబడి ల్యాబ్కే పరిమితమైన సందర్భాలు చాలానే వున్నాయి. వాటిని కా క్రమంలో ప్రేక్షకులకు మర్చిపోయిన సందర్భాలూ ఎక్కువే. అదే పరిస్థితిని తమన్నా చిత్రం ఎదుర్కుంటోంది. ఆమె నటించిన చిత్రం `దటీజ్ మహాలక్ష్మి`. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `క్వీన్` ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. ముందు చిత్రానికి నీలకంఠను దర్శకుడిగా అనుకున్నారు. ఆయనతో షూటింగ్ కూడా మొదలైంది.
తమన్నాకు, నీలకంఠకు మధ్య ఈగో క్లాషెష్ రావడంతో మధ్యలోన ఆయనని డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పించారు. మిగతా భాగాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ పూర్తి చేశారు. ఆది నుంచి వివాదాల మయంగా మారిన ఈ చిత్రం గత కొంత కాలంగా సెన్సార్ చిక్కుల్లో ఇరుక్కుంది. సెన్సార్ క్లీన్ యూ ఇవ్వాలంటే 25 కట్స్ విధించాల్సిందే అంటున్నారు. దీంతో చిత్ర బృందం రివిజన్ కమిటీకి వెళ్లింది. అక్కడా ఆలస్యం అవుతుండటంతో ఈ చిత్రాన్ని సెన్సార్ చేయకుండానే ఓటీటీకి అమ్మేయాలని డిజైడ్ అయినట్టు తెలిసింది.
కరోనా కారణంగా ప్రస్తుతం ఓటీటీల హవా మొదలైంది. దీంతో థియేటర్స్ లేవు కాబట్టి డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయడమే బెటర్ ఆప్షన్ అని చాలా మంది నిర్మాతలు తమ చిత్రాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇదే తరహాలో తమన్నా నటించిన `దటీజ్ మహాలక్ష్మి`ని కూడా ఓటీటీ లో రిలీజ్ చేయాలని ఇప్పటికే ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్తో చర్చలు జరుపుతున్నారట. అన్నీ ఓకే అయితే తమన్నా మూవీ డైరెక్ట్ ఓటీటీకే అన్నమాట.