ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా కోసం తమన్నా టాక్ షో ను ప్లాన్ చేసిన విషయం తెల్సిందే. అల్లు అరవింద్ స్పెషల్ గా ఈ టాక్ షో పై ఆసక్తి చూపిస్తున్నాడట. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైన ఈ టాక్ షో తాజా సమాచారం ప్రకారం దసరా నుండి మొదలుకానుందని తెలుస్తోంది. దసరా రోజున ఈ టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేస్తారట. తమన్నా హోస్ట్ కావడంతో టాక్ షో కు కావలసినంత గ్లామర్ వచ్చేసింది. టాలీవుడ్ నుండే కాక తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలను కూడా ఈ టాక్ షో లో భాగం చేయాలని చూస్తున్నారు. కేవలం ఒక ఇంటర్వ్యూలా కాకుండా ఈ టాక్ షో చాలా ఫన్నీగా ఉండబోతోందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్స్ కు ఆదరణ బాగున్న నేపథ్యంలో ప్రత్యేకంగా తెలుగు వారి కోసం రూపొందించిన ఈ ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో టాక్ షో తో పాటు వివిధ రకాల ఎంటర్టైన్మెంట్ లను కూడా అల్లు అరవింద్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.