సోషల్ మీడియాలో తాప్సీ చాలా యాక్టీవ్గా వుంటోంది. ఏవిషయంలో తనని ట్రోల్స్ చేసిన వెంటనే రిప్లై ఇచ్చేస్తూ షాకిస్తోంది. `సాండ్ కీ ఆంఖ్` సినిమా సందర్భంగా కంగనా రనౌత్ సిస్టర్ రంగోలి చండేల్తో చిన్న పాటి యుద్ధమే చేసింది. బాలీవుడ్ జనాలు రంగోలీ నోటికి భయపడుతూ ఎదురు సమాధానం చెప్పడానికి జంకుతుంటే తాప్సీ మాత్రం సున్నితంగా ప్రశ్నిస్తూనే ఎదురుదాడికి దిగి బాలీవుడ్ వర్గాలని ఆకట్టుకున్నవిషయం తెలిసిందే.
తాజాగా మళ్లీ అలాంటి పనే చేసి శభాష్ అనిపించుకుంది. `సాండ్ కీ ఆంఖ్` చిత్రానికి గానూ ఇటీవల జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నటిగా అవార్డుని దక్కించుకుంది తాప్సీ. తాప్సీ ఫిల్మ్ ఫేర్ అవార్డుని అందుకున్న ఆనందంలో వున్న ఫొటోని షేర్ చేస్తూ నిర్మాత తనుజ్ గార్గ్ ఓ ఆసక్తికరమైన పోస్ట్ను షేర్ చేశారు. తాప్సీ బాలీవుడ్కు లేడీ అయుష్మాన్ ఖురానా అని, ఆమె ఓ పవర్ హౌజ్ అని అభివర్ణించాడు. కంగ్రాట్స్ పవర్హౌజ్ తాప్సీ. హమారే బాలీవుడ్కి ఫిమేల్ ఆయుష్మాన్ ఖురానా` అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.
దీనికి తెలివిగా సమాధానం చెప్పింది తాప్సీ. ఇంతకు ముందు తనని బాలీవుడ్కు తొలి తాప్సీ పన్ను అంటూ సంబోధించేవారని ఇప్పుడేమో లేడీ ఆయుష్మాన్ ఖురానా అంటూ ప్రశంసిస్తున్నారని అర్థమొచ్చేలా ట్వీట్ చేయడం బాలీవుడ్ వర్గాలని ఆకట్టుకుంటోంది. తాప్సీ జర్మన్ హిట్ ఫిల్మ్ `రన్ లోలా రన్` ఆధారంగా రూపొందుతున్న `లూప్ లొపేటా` చిత్రంలో నటిస్తోంది.