దిశా పటాని.. బాలీవుడ్ హాట్ బాంబ్ షెల్. చేసిన సినిమాలు తక్కువే అయినా క్రేజీ స్టార్గా పాపులారిటీని సొంతం చేసుకుంది. టైగర్ ష్రాఫ్ తో ఎఫైర్ కారణంగా బాలీవుడ్లో టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారినా తన ఒంపు సొంపులతో సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా భారీ క్రేజ్ని సొంతం చేసుకుంది. ఇన్స్టాగ్రామ్లో అత్యధికంగా ఫాలో అవుతున్న ఇండియన్ సెలబ్రిటీల్లో దిషా పటాని ముందు వరుసలో నిలుస్తోందంటే దిశా ఏ స్థాయిలో మాయ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు.
లో దుస్తుల బ్రాండ్ కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్గా మారి ఆ ప్రొడక్ట్లకు భారత్లో క్రేజ్ని తీసుకొచ్చింది. ఎలాంటి మొహమాటం లేకుండా కెల్విన్ క్లేన్ బ్రాండ్ లోదుస్తుల్లో ఫొటోలకు పోజులిస్తూ ఇన్ స్టాని హీటెక్కించింది. గత కొంత కాలంగా లాక్డౌన్ కారణంగా ఈ ప్రచారానికి దూరంగా వున్న దిశా పటాని మళ్లీ జోరు పెంచేసింది.
రెడ్ కలర్ బికినీ పోస్ట్కు దాదాపు మూడు మిలియన్ల లైక్లు వచ్చాయి. తాజాగా మరో ఫొటోని షేర్ చేసింది. లైట్ బ్లూకలర్ బికినీ ధరించి దిశ హల్చల్ చేస్తున్న ఫొటో ఇప్పటికే వైరల్ అయ్యింది. ఈ ఫోటోకు కేవలం ఒక గంటలో మిలియన్ కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ఎప్పటిలాగే దిశా ఎటువంటి వ్యాఖ్య లేకుండా ఈ ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటో చూసిన వాళ్లంతా దిశా పటానీ మళ్లీ ఇన్ స్టాలో జోరు పెంచేసిందంటున్నారు.