సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మాణంలో తెరకెక్కుతున్న మూవీ సర్కారు వారి పాట. రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మే 12 న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. మొత్తం 603 థియేటర్స్ లలో సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే మే 11 న ప్రీమియర్ షోస్ పడనున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. ఇక రీసెంట్ గా విడుదలై ట్రైలర్ యూట్యూబ్ లో 30 మిలియన్ వ్యూస్ రాబట్టి దూసుకెళ్తుంది.
ఈ చిత్రాన్నిచిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ – GMB ఎంటర్టైన్మెంట్ – 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని – వై. రవిశంకర్ – రామ్ ఆచంట – గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు ఇక మీరు కూడా ఈ ట్రైలర్ ఫై లుక్ వెయ్యండి.