బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ గురించి రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. తాజాగా అతనితో లూడో ఆడిన ఓ వ్యక్తి సుశాంత్ గురించి పలు ఆసక్తికరమైన విషయాల్ని బయట పెడుతూ సోషల్ మీడియా ఇన్ స్టాలో ఓ వీడియోని సోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. సుశాంత్ వ్యక్తిత్వం, అతని మైండ్ సెట్ చాలా భిన్నంగా వుండేదని, అందరికి భిన్నంగా అతని ఆలోచనలు వుండేవని రామ్ నరేష్ దివాకర్ అనే వ్యక్తి చెప్పడం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.
సుశాంత్ స్టార్ హీరో. వరుసగా బ్లాక్ బస్టర్లని దక్కించుకున్నాడు. `ఎం.ఎస్ థోనీ` బయోపిక్తో అతనికి దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఎం.ఎస్ థోనీని అభిమానించే ప్రతీ క్కరూ సుశాంత్కి ఫ్యాన్స్గా మారిపోయారు. అయితే సుశాంత్ ఎన్నడూ ఓ స్టార్లా ఫీలవ్వలేదని, సాధారణ వ్యక్తిలా వుండేవాడని, తనకు వచ్చిన పలు అవార్డుల్ని కఫెన్ (శవ పేటిక) లాంటి ఓ పెట్టేలో పడేసేవాడని, అది చూసి ఆశ్చర్యపోయానని, ఓ రోజు దాని గురించి సుశాంత్ని అడిగితే సక్సెస్, క్రేజ్ ఎప్పుడూ తలకెక్కకూడదంటే వాటిని మర్చిపోవాలని, అందుకే వాటిని ఈ బాక్సుల పడేస్తానని సుశాంత్ చెప్పాడట. ఆ మాటలు విని రామ్ నరేష్ దివాకర్ ఆశ్చర్యపోయానని చెబుతున్నాడు.
సుశాంత్ వ్యక్తితం ఉన్నతమైనదని, ఎప్పుడూ ఎలాంటి ఒత్తిడి అతనిలో కనిపించేది కాదని ఓ సందర్భంలో ఉదయం ఆరు గంటలకే తనని లూడో ఆడటానికి ఇంటికి రమ్మన్నాడని, అది తెలిసి ఆశ్చర్యపోయానని, ఏంటీ ఈ వ్యక్తి ఇంత సాఫీగా జాలీగా వున్నాడని అవాక్కయ్యానని, ఓ గడియారంపై నాసా అని రాసి వుందని అది నాకిస్తావా అని అడిగాడని, అలాంటి మంచి మనిషి ఈ రోజు మన మధ్య లేకపోవడం బాధగా వుందని రామ్ నరేష్ దివాకర్ భావోద్వేగానికి లోనయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.