వరుస ఛాన్సులతో చెలరేగిపోతున్న ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి..తాజాగా సూర్య సరసన నటించే ఛాన్స్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సూర్య ఈటీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాండిరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ రీసెంట్ గా విడుదలై ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఈ సినిమా ఫలితం తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. సూర్య తన తదుపరి ప్రాజెక్టుగా బాల దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ మూవీ షూటింగ్ రామేశ్వరంలో వచ్చే రెండు, మూడు నెలల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ లో పవన్ కు జోడిగా కృతి శెట్టి ని అనుకుంటున్నారట. మరి ఈ మూవీ కి కృతి శెట్టి ఓకే చెపుతుందో లేదో చూడాలి.
- Advertisement -