Homeటాప్ స్టోరీస్సుధీర్‌వర్మ‌తో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ చిత్రం!

సుధీర్‌వర్మ‌తో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ చిత్రం!

సుధీర్‌వర్మ‌తో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ చిత్రం!
సుధీర్‌వర్మ‌తో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ చిత్రం!

శ‌ర్వానంద్ హీరోగా తెర‌పైకొచ్చిన చిత్రం `ర‌ణ‌రంగం`. సుధీర్‌వ‌ర్మ తెర‌కెక్కించిన ఈ చిత్రం గ‌త ఏడాది విడుద‌లై ప్రేక్ష‌కుల‌తో పాటు చిత్ర బృందాన్ని కూడా నిరాశ‌కు గురిచేసింది. కాజ‌ల్ అగ‌ర్వాల్, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శిన హీరోయిన్‌లుగా న‌టించిన ఈ చిత్రం మేకింగ్ ప‌రంగా ప్ర‌శంస‌లు అందుకున్నా క‌థ ప‌రంగా మాత్రం ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్న ద‌ర్శ‌కుడు సుధీర్‌వ‌ర్మ ఫ‌లితం తారుమారు కావ‌డంతో కొంత నిరుత్సాహానికి గుర‌య్యార‌ట‌.

అయితే తాజాగా ఆయ‌న‌కు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ లభించిన‌ట్టు తెలిసింది. సుధీర్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రాన్ని నిర్మించ‌డానికి ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలిసింది. ఇటీవ‌ల ఓ బేబీ, వెంకీ మామ వంటి చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకున్న డి. సురేష్‌బాబు త్వ‌ర‌లో మ‌రో చిత్రాన్ని నిర్మించ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. కొరియ‌న్ సినిమా ఆధారంగా `ఓ బేబీ` చిత్రాన్ని నిర్మించిన ఆయ‌న తాజాగా `మిడ్‌నైట్ ర‌న్న‌ర్స్‌` అనే మ‌రో కొరియ‌న్ క‌థ‌నే తెలుగు తెర‌కు తీసుకొస్తున్నార‌ట‌.

- Advertisement -

కొరియ‌న్ చిత్రం ఇద్ద‌రు హీరోల నేప‌థ్యంలో సాగితే దాన్ని తెలుగుకే మాత్రం ఇద్ద‌రు హీరోయిన్‌ల నేప‌థ్యంలో సాగేలా మారుస్తున్నారు. ఇందు కోసం ఇప్ప‌టికే రెజీనా, నివేదా థామ‌స్‌ల‌ని ఎంపిక చేసుకున్నార‌ట‌. టెక్నిక‌ల్‌గా సినిమా హై స్టాండ‌ర్డ్స్‌లో వుండాల‌ని ప్లాన్ చేసిన సురేష్‌బాబు ఈ చిత్ర రీమేక్ కోసం ద‌ర్శ‌కుడు సుధీర్‌వ‌ర్మని ద‌ర్శ‌కుడిగా ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలిసింది. దీనికి సంబంధించిన అధిక‌రిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All