ప్రముఖ నటి సన్నీ లియోన్ను కేరళ పోలీసులు గత వారం ప్రశ్నించారు. మోసం కేసు ఆరోపిస్తూ ఈవెంట్ మేనేజర్ సన్నీ లియోన్పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజా నివేదికల ప్రకారం కేరళకు చెందిన ఒక ఈవెంట్ మేనేజర్ ఆర్ శ్రీయాస్ కొచ్చిలో ఐదు కార్యక్రమాలకు హాజరుకావడానికి ఆమెకు 29 లక్షలు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారట. రాష్ట్రంలో వివిధ ప్రారంభ కార్యక్రమాలకు హాజరవుతానని ఆమె హామీ ఇచ్చారని, కానీ దేనికీ హాజరు కాలేదని ఆయన ఆరోపించారు.
తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్లో సన్నీ లియోన్ను కేరళ డిజిపి ప్రశ్నించింది. ఈవెంట్ మేనేజర్ తన మేనేజర్ 2016 సంవత్సరం నుండి అనేక వాయిదాలలో డబ్బు తీసుకున్నాడని ఆరోపించారు. కాని నటి ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు.
పోలీసులు ప్రశ్నించినప్పుడు సన్నీ లియోన్ తాను డబ్బు తీసుకున్నట్లు ఒప్పుకుందని, అయితే తనకు ఈవెంట్ మేనేజర్ను మోసం చేయాలనే ఉద్దేశ్యం లేదు అని తెలిపిందట. సన్నీ లియోన్ ఇచ్చిన స్టేట్మెంట్ ని పోలీసులు రికార్డ్ చేశారు. పోలీసులు తదుపరి చర్య తీసుకునే ముందు ఫిర్యాదు దారుడి నుండి మరింత సమాచారం సేకరించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.