`ప్రేమకథా చిత్రం – 2` తరువాత సుమంత్ అశ్విన్ నటిస్తున్న తాజా చిత్రం బుధవారం హైదరాబాద్లో మొదలైంది. గురుప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్పై జి. మహేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్చ ఇంద్రజ, ప్రియ వడ్లమాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామ్గోపాల్వర్మ, పూరిజగన్నాథ్, నగేష్ కుకునూర్ ల వద్ద దర్శకత్వ శాఖలో వర్క్ చేసిన గురుపవన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తొలి సన్నివేశాలనికి ఎస్.బి. బాలసుబ్రమణ్యం క్లాప్ నివ్వగా, కెమెరామెన్ సి. రామ్ప్రసాద్ కెమెరా స్విఛాన్ చేశారు.
నలుగురు అపరిచితులు…3,450 కిలోమీటర్ల ప్రయాణం.. వాళ్ల ప్రయాణం ఎందు కోసం? ఈ ప్రయాణంలో వాళ్లు ఎలాంటి సవాళ్లని ఎదుర్కొన్నారు?. ఆ తరువాత ఏం జరిగింది? అన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. ఇందులో నలుడురు అపరిచితులుగా సమంత్ అశ్విన్, శ్రీకాంత్, ఇంద్రజ, ప్రియా వడ్లమాని నటిస్తున్నారు. భిన్న నేపథ్యాలున్న ఈ నలుగురు హైదరాబాద్ నుంచి బైక్ పై ప్రయాణం మొదలుపెడతారట.
మార్చి 2 రెంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. తొలి షెడ్యూల్ ఫస్ట్ వీక్లో పూర్తి చేసి 22 నుంచి రెండవ షెడ్యూల్ని మొదలుపెడతారట. ఆ తరువాత హైదరాబాద్, ఝాన్సీ, మనాలి, నాగ్పూర్, గ్వాలియర్లో మిగతా భాగాన్ని పూర్తి చేస్తారట.