`దండు పాళ్యం` సిరీస్ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు శ్రీనివాసరాజు. కొంత విరామం తరువాత ఆయన తాజాగా మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన కథ. కథనాలతో రూపొందనున్న ఈ చిత్రానికి `18 + సినిమా` అనే టైటిల్ని ఖరారు చేశారు. ఇందులో లవర్స్, కేరింత చిత్రాల ఫేమ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. సలోని మిశ్రా కథానాయిక.
జ్యో స్టార్ ఎంటర్టర్ ప్రైజెస్ బ్యానర్పై ఎం. కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ మొదలైంది. చివరి షెడ్యూల్ని ఈ నెల 11 నుంచి 20 వరకు తమిళనాడులోని తిరువల్లూరులో వేసిన సెట్లో చిత్రీకించబోతున్నారు. ఈ షెడ్యూల్తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సమ్మర్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత ప్లాన్ చేస్తున్నారు.
మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో `దండుపాళ్యం` ఫేమ్ మకరంద్ దేశ్పాండే, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రియలిస్టిక్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీనివాసరాజు ఈ చిత్రాన్ని సరికొత్త నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారు. ఆయనే ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లేని కూడా అందిసకతున్నారు.