Homeటాప్ స్టోరీస్మీడియాపై మండిప‌డిన యాంక‌ర‌మ్మ‌!

మీడియాపై మండిప‌డిన యాంక‌ర‌మ్మ‌!

మీడియాపై మండిప‌డిన యాంక‌ర‌మ్మ‌!
మీడియాపై మండిప‌డిన యాంక‌ర‌మ్మ‌!

టాలీవుడ్‌లో ఏ భారీ ఫంక్ష‌న్ జ‌రిగినా ఆ వేడుక‌లో సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచే వ్య‌క్తి సుమ‌. భారీ హీరోల ప్రీరిలీజ్ ఈ వెంట్‌ల‌ని, బుల్లితెర‌పై జ‌రిగే కార్య‌క్ర‌మాల‌ని త‌న‌దైన మార్కు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని జోడించి ర‌క్తిక‌ట్టిస్తున్న పాపుల‌ర్ యాంక‌ర్ సుమ‌. యాంక‌ర్‌ల‌కు రోల్ మోడ‌ల్‌గా నిలిచిన సుమపై ఇటీవ‌ల కొన్ని వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. సుమ ఇంటిపై జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వ‌హించార‌న‌, జీఎస్టీ ఎగ‌వేయ‌డంతో ఆమెపై, ఆమె పెట్టుబ‌డులు పెట్టిన సంస్థ‌ల‌పై జీఎప్టీ ఇంట‌లిజెన్స్ అధికారులు కేస్ ఫైల్ చేశార‌ని వార్త‌లు గుప్పుమ‌న్న విష‌యం తెలిసిందే.

అయితే ఈ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని, ఇవ‌న్నీ అవాస్తవాల‌ని స్టార్ యాంక‌ర్ సుమ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. త‌న‌పై వ‌స్తున్న త‌ప్పుడు వార్త‌ల‌పై స్పందించిన సుమ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ మ‌ధ్య మా ఇంట్లో జీఎస్టీ రైడ్స్ జ‌రిగాయ‌ని వార్త‌లు షికారు చేస్తున్నాయి. ఆ వార్త‌లు పూర్తిగా అవాస్త‌వం. నేను క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి చేరుకున్నాన‌ని, ప్ర‌భుత్వానికి చెల్లించాల్సిన ప‌న్నుల్ని స‌కాలంలో చెల్లిస్తున్నాన‌ని, త‌న వ‌ద్ద రికార్డులు కూడా వున్నాయ‌ని, త‌ను చ‌ట్టానికి లోబ‌డే ట్యాక్సులు క‌డుతున్నాన‌ని వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -

ఫైన‌ల్‌గా ఇలాంటి గాసిప్స్ వ‌స్తూనే వుంటాయ‌ని, అలాంటి వాటిని ప్ర‌తీసారి ఖండిస్తూ కూర్చోలేన‌ని, కానీ సైలెంట్‌గా వుంటే జ‌నాలు ఈ వార్తే నిజ‌మ‌ని న‌మ్మే ప్ర‌మాదం వుంది కాబ‌ట్టి క్లారిటీ ఇస్తున్నాన‌ని, నాపై వ‌చ్చిన వార్త‌లు నిజ‌మా? కాదా అని తెలుసుకోకుండా కొన్ని వార్తా ప‌త్రిక‌లు, టీవి ఛాన‌ల్స్ బాధ్య‌తార‌హితంగా వ్య‌వ‌హ‌రించాయ‌ని సుమ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All