భారతీయ తెరపై ఇప్పటి ఎవరూ టచ్ చేయని నేపథ్యం తెలంగాణ సాయుధ పోరాటం. నిజాం కాలం నాటి కథ, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఊరి కోసం నమ్మిన వారి కోసం.. బానిస జీవితాల విముక్తి కోసం తెలంగాణలో కొంత మంది సాయుధులుగా మారి పోరాటం చేశారు. కొంత మందిని ఖాసీ రజ్వకి చెందిన ముఠా హత్య చేస్తే మరి కొంత మంది సెప్టెంబర్ 17 కి పముందు జరిగిన పోలీస్ ఆపరేషన్లో ప్రాణాల్ని పోగొట్టుకున్నారు.
ఇది ఎవరూ రాయని చరిత్ర.. చరిత్ర పుటల్లో మరుగున పడిన చరిత్ర ఇదే చరిత్రని వెండితెరపైకి తీసుకురావాలని కంత మంది ప్రయత్నాలు చేసి ఎవరూ సాహసించకపోవడంతో ఆ ప్రయత్నాలని విరమించుకున్నారు. మళ్లీ ఇప్పటికి తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో సినిమా చేయడానికి ఒక దరర్శకుడు అడుగులు వేస్తున్నాడు ఆయనే సుకుమార్. `రంగస్థలం` చిత్రంతో సంచలనం సృష్టించిన సుకుమార్ ఈ సినిమా తరువాతే తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో సినిమా చేయాలనుకున్నారట.
అయితే అది కుదరలేదని, `పుష్ప` తరువాత తప్పుకుండా చేస్తానని ఇటీవల ఓ మీడియా ఇంటరాక్షన్లో అసక్తికర విషయాల్ని వెల్లడించడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. సుకుమార్ ఈ కథతో సాహసం చేస్తున్నారని అంతా అంటున్నారు.