`ఆర్య` సినిమాతో దర్శకుడిగా పరిచయమై తొలి చిత్రంతోనే వన్ సైడ్ లవ్ థియరీని చెప్పేసి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు లెక్కల మాస్టారు సుకుమార్. 100% లవ్, నాన్నకు ప్రేమతో వంటి క్లాస్ చిత్రాలే కాకుండా `రంగస్థలం`తో మాస్ని ఆకట్టుకునే చిత్రాల్ని కూడా తీయగలనని నిరూపించుకున్నారు. రామ్చరణ్ వంటి కమర్షియల్ హీరోని చిట్టిబాబు పాత్రలో చూపించి విమర్శకులని సైతం మెప్పించారు. ఆయన ఏ సినిమా చేసిన లెక్కలు మాత్రం వీడరు. కానీ తొలిసారి `రంగస్థలం` కోసం తన లెక్కలని పక్కన పెట్టి సినిమా చేశారు.
బ్లాక్బస్టర్ విజయన్ని సొంతం చేసుకున్న ఆయన తాజాగా స్టైలిష్స్టార్ అల్లు అర్జున్తో మళ్లీ మాస్ పార్మాలా సినిమానే తెరపైకి తీసుకురాబోతున్నారు. మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాల్నిచిత్ర బృందం ఇటీవలే లాంఛనంగా పూర్తి చేసింది. అల్లు అర్జున్ నటిస్తున్న 20వ చిత్రమిది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. నేడు సుకుమార్ పుట్టిన రోజు కావడంతో ఈ చిత్రానికి సంబంధించిన లొకేషన్ల వీడియోని చిత్ర బృందం రిలీజ్ చేసింది.
గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరపైకి రాబోతోంది. ఊర మాస్ పాత్రలో లారీ డ్రైవర్గా బన్నీ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా `రంగస్థలం` తరహాలో పూర్తి నేటివిటీ చిత్రంగా ఈ సినిమా తెరపైకి రాబోతోంది. `అల వైకుంఠపురములో` ఈ 12న రిలీజ్ అవుతుండటంతో అల్లు అర్జున్ త్వరలోనే సుకుమార్ చిత్రానికి డేట్స్ కేటాయించబోతున్నారట. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా బన్నీకి మరో డిఫరెంట్ ఫిల్మ్ అవుతుందని చెబుతున్నారు.