అక్కినేని నాగచైతన్య తాజాగా చందు మొండేటి దర్శకత్వంలో ” సవ్యసాచి ” సినిమా చేస్తున్నాడు . ఆ సినిమాలో కింగ్ నాగార్జున నటించిన ” అల్లరి అల్లుడు ” చిత్రంలోని ” నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు ” అనే పాట ని రీమిక్స్ చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు . ఈ పాటలో ఓ స్టార్ హీరోయిన్ ఉంటే బాగుంటుందని భావించి రకుల్ ప్రీత్ సింగ్ ని అడిగారట మొదట కానీ కుదరలేదు దాంతో రాశి ఖన్నా ని అడిగారు ” ఐటెం సాంగ్ ” చేసేది లేదని చెప్పేసిందట .
శృతి హాసన్ ని అడిగారట ఆమె ఇంకా సమాధానం చెప్పలేదు దాంతో కాజల్ అగర్వాల్ ని అడిగారు సేమ్ డైలాగ్ ఐటెం సాంగ్ చేయను అని చెప్పిందట ఇక గోవా భామ ఇలియానా ని అడిగారట . ఇలియానా కు కాస్త గోరోజనం ఎక్కువ కాబట్టి ఆమె కూడా నో చెప్పేసింది . మొత్తం మీద చైతూ ని నలుగురు రిజెక్ట్ చేయగా శృతి హాసన్ మాత్రం వెయిటింగ్ లిస్ట్ లో పెట్టింది . ఇక మిగిలింది సమంత , తమన్నా లు . మరి ఈ ఇద్దరిలో తమన్నా ని మాత్రమే అడుగుతారేమో ! సమంత – చైతు ల ఐటెం సాంగ్ అంటే బాగుండదు కదా ! అందుకు .