టాలీవుడ్లో కొరియన్ చిత్రాలకు డిమాండ్ పెరుగుతోంది. గతంలో ఫ్రీగా కొరియన్ చిత్రాల కథల్ని కాపీ చేసిన మనవాళ్లు `బాహుబలి` తరువాత వరల్డ్ అంతా టాలీవుడ్ సినిమాలపై ఓ కన్నేయడంతో ఫ్రీమేక్ల జోలికి వెళ్లడం లేదు. అఫీషియల్గా రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకుని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇటీవల సమమంత ప్రధాన పాత్రలో వచ్చిన `ఓ బేబీ` చిత్రం కొరియన్ చిత్రం `మిస్ గ్రానీ` ఆధారంగా రూపొందిన విషయం తెలిసిందే.
అఫీషియల్గా కొరియన్ మూవీ రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకుని ఈ చిత్రాన్ని డి. సురేష్బాబు, సునీత తాటి రీమేక్ చేశారు. తెలుగులో అనూహ్య విజయం సాధించడంతో ఇదే ఊపులో నిర్మాత డి. సురేష్ బాబు మరో రెండు కొరియన్ చిత్రాల రీమేక్ హక్కుల్ని దక్కించుకున్నారు. అవే మిడ్నైట్ రన్నర్స్, డ్యాన్సింగ్ క్వీన్. ఈ రెండు చిత్రాల్లో `మిడ్నైట్ రన్నర్స్` రీమేక్కు దర్శకుడు సుధీర్వర్మ దర్శకత్వం వహించబోతున్నారు.
ఇందులో రెజీనా, నివేదా థామస్ కీలకమైన లీడ్ పాత్రల్లో నటించనున్నారు. ఇక `డ్యాన్సింగ్ క్వీన్` చిత్రారికి యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీవాస్ దర్శకత్వం వహించనున్నారు. ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. యాక్షన్ డైరెక్టర్ ని రొమాంటిక్ సినిమాకు ఎంచుకోవడం సాహసమే అంటున్నారు. ఈ రెండు చిత్రాలకు సునీత తాటి సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.