అతిలోక సుందరి శ్రీదేవి ని పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసారని అయితే అది సహజ మరణం అనిపించేలా చేసారని సంచలన ఆరోపణలు చేస్తున్నాడు మాజీ అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ వేద్ భూషణ్ . శ్రీదేవి ఫిబ్రవరి 24న దుబాయ్ లోని జుమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్ లో ప్రమాదవశాత్తు చనిపోయిన విషయం తెలిసిందే . ఆల్కహాల్ సేవించిన శ్రీదేవి మద్యం మత్తులో స్నానం చేయడానికి వెళ్లి బాత్ టబ్ లో పడి చనిపోగా ఆమె మరణం పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ దుబాయ్ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేసారు . శ్రీదేవి భర్త బోనీ కపూర్ పై అనుమానాలు కూడా వ్యక్తం చేసారు కూడా కట్ చేస్తే అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి కొంతమంది జోక్యం తో .
అయితే శ్రీదేవిని హత్య చేసారని ఈ మాజీ ఎసిపి ఎందుకు ఆరోపిస్తున్నాడో తెలుసా ….. ….. శ్రీదేవి పైన 240 కోట్ల ఇన్సూరెన్స్ ఉందట పైగా ఆ ఇన్సూరెన్స్ డబ్బులు రావాలంటే శ్రీదేవి దుబాయ్ లో మరణిస్తేనే ఇస్తారని దుబాయ్ కాకుండా ఇతర దేశాల్లో చనిపోతే ఇవ్వరని అందుకే పక్కా ప్లాన్ ప్రకారం శ్రీదేవి ని హత్య చేసి ప్రమాదం గా చూపిస్తున్నారని సంచలన ఆరోపణలు చేస్తున్నాడు . అంతేకాదు దుబాయ్ లో శ్రీదేవి బస చేసిన హోటల్ కు కూడా వెళ్ళాడట పరిశోధన నిమిత్తం కానీ ఆమె బస చేసిన హోటల్ లోకి అక్కడి సిబ్బంది అనుమతి ఇవ్వలేదని అంటున్నాడు వేద్ భూషణ్ .