Homeగాసిప్స్నాని సినిమాపై మళ్ళీ రచ్చ మొదలైంది!

నాని సినిమాపై మళ్ళీ రచ్చ మొదలైంది!

నాని సినిమాపై మళ్ళీ రచ్చ మొదలైంది!
నాని సినిమాపై మళ్ళీ రచ్చ మొదలైంది!

తెలంగాణ లో కరోనా వైరస్ రోజు రోజుకి పెరిగిపోతోంది. రోజు వందల సంఖ్య లో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ జీహెచ్ ఎంసీ పరిధిలో భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు పెరిగి పోతున్నాయి. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత ప్రమాద కర స్థాయికి చేరుకుంటాయని  వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి హైదరాబాద్ లో ప్రభుత్వం లాక్ డౌన్ విధించబోతోంది.

దీంతో ఇప్పట్లో సినిమా థియేటర్లు ఓపెన్ చేసే పరిస్థితులు కనిపించడంలేదు. కరోనా కట్టడి అయితే కానీ థియేటర్స్ ని సెప్టెంబర్ లో పున: ప్రారంభించాలని అనుకున్నారు కానీ పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వి’ వార్తల్లో నిలుస్తోంది. కరోనా ఉధృతి ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ‘వి’ ఓటిటీ లో రిలీజ్ కానుందంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
నిర్మాత దిల్ రాజు, హీరో నాని మాత్రం ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ చిత్రాన్ని థియేటర్ లోనే రిలీజ్ చేయాలని స్ట్రాంగ్ గా ఫిక్సయ్యారట. బాలీవుడ్ బిగ్ స్టార్స్ ఓటిటీ కి జై కొడుతున్న వేళ  నాని మాత్రం నో ఓటిటీ ఓన్లీ థియేటర్ అంటుండటం ఇండస్ట్రీ వర్గాలకు విస్మయాన్ని కలిగిస్తోందని చెప్పుకుంటున్నారు.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All