Homeఎక్స్ క్లూసివ్ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తల్లి మృతి

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తల్లి మృతి

Sp Balasubrahmanyam mother diedగాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంట విషాదం నెలకొంది . ఎస్పీ బాలు తల్లి శకుంతలమ్మ (89) ఈరోజు నెల్లూరు లో కన్నుమూసింది . గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శకుంతలమ్మ నెల్లూరు లోనే ఉంటోంది . ఈరోజు పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచింది . తల్లి మరణవార్త విన్న బాలసుబ్రహ్మణ్యం కన్నీళ్ల పర్యంతం అయ్యారు.

అయితే లండన్ లో సంగీత కచేరి కోసం వెళ్లిన ఎస్పీ బాలు తన పర్యటనని అర్దాంతరంగా ముగించుకొని భారత్ కు బయలుదేరాడు . బాలు చెన్నై లో స్థిరపడ్డాడు అయితే తల్లిదండ్రులు మాత్రం నెల్లూరు లోనే ఉండిపోయారు . శకుంతలమ్మ అంత్యక్రియలు రేపు నెల్లూరు లో జరుగనున్నాయి . ఎస్పీ బాలు తల్లి మృతి చెందటంతో బాలుకి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు పలువురు సినీ ప్రముఖులు .

- Advertisement -

English Title: Sp Balasubrahmanyam mother died

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All