తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు స్నేహ. ఆమెలాగే భర్త ప్రసన్న కూడా తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపుని పొందారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఈ జంట గత కొంత కాలంగా అన్వోన్యంగా జీవిస్తోంది. వీరి ఇరు కుటుంబాలకు తాజాగా కరెంట్ షాక్ తగిలింది. లాక్డౌన్ కారణంగా జనజీవితం స్థంభించిపోవడంతో వ్యవస్థలన్నీ అచేతన స్థితిలోకి వెళ్లిపోయాయి.
కీలక సంస్థలన్నీ బంద్ కావడంతో కీలకంగా వున్న విద్యుత్ వ్యవస్థ పనిచేస్తున్నా కరోనా వైరస్ కారణంగా సకాలంలో మాత్రం సిబ్బంది కరెంట్ బిల్లుల రీడింగ్ తీయడం లేదు. దీంతో దేశ వ్యాప్తంగా వినియోగదారులకు కరెంట్ బిల్లు రూపంలో షాక్ తగులుతోంది. ఇలాంటి షాకే స్నేహ కుటుంబాలకు తగటడం కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
స్నేహతో పాటు ప్రసన్న కుటుంబానికి ఒక నెల కరెంట్ బిల్లు 70 వేలు వచ్చిందంట. దీంతో కంగుతిన్న ప్రసన్న ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టడం వైరల్గా మారింది. `నాకు 70 వేల బిల్లు చెల్లించే స్థోమత వుంది. కానీ పేద, మధ్య తరగతి వారికి ఈ స్థాయిలో బిల్లు వస్తే వారి పరిస్థితి ఏంటి. గడిచిన ఇన్నేళ్లలో ఏ నెలా తనకు ఇంత బిల్లు రాలేదని ట్విట్టర్ వేదికగా ప్రసన్న ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది.