Homeటాప్ స్టోరీస్88 ఏళ్ల వ‌య‌సులో యాక్ష‌న్‌.. క‌ట్‌!

88 ఏళ్ల వ‌య‌సులో యాక్ష‌న్‌.. క‌ట్‌!

88 ఏళ్ల వ‌య‌సులో యాక్ష‌న్‌.. క‌ట్‌!
88 ఏళ్ల వ‌య‌సులో యాక్ష‌న్‌.. క‌ట్‌!

క్రియేటివిటికి వ‌య‌సుతో ప‌నిలేదు. శ‌రీరం స‌హ‌క‌రిస్తే చాలు అనుకున్న‌ది ఏదైనా చేయ‌గ‌లం. ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు ప్ర‌ముఖ సీనియ‌ర్ ద‌ర్శ‌కులు సింగీతం శ్రీ‌నివాస‌రావు. గ‌త కొంత కాలంగా డైరెక్ష‌న్‌కు దూరంగా వుంటూ వస్తున్నారాయ‌న‌. అద్దె గర్భం నేప‌థ్యంలో `వెల్క‌మ్ ఒబామా` చిత్రాన్ని తెర‌కెక్కించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకున్నారు.

ఆ త‌రువాత మ‌రో చిత్రాన్ని తెర‌కెక్కించ‌లేదు. గ‌త రెండేళ్ల క్రితం బాల‌కృష్ణ‌తో `ఆదిత్య369`కు సీక్వెల్‌గా `ఆదిత్య 999` చిత్రాన్ని తెర‌పైకి తీసుకొస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే బాల‌య్య క‌థ‌లో మార్పులు చెప్ప‌డం దానికి స‌మ‌యం ప‌ట్ట‌డంతో ఆ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి రాకుండానే ఆగిపోయింది. దీంతో సింగీతం శ్రీ‌నివాస‌రావు మ‌రో క‌థ‌పై వ‌ర్క్ చేయ‌డం మొద‌లుపెట్టార‌ట‌.

- Advertisement -

ప్ర‌స్తుతం ఆ క‌థ‌కు తుది మెరుగులు దిద్దుతున్నార‌ట‌. ఓ గాయ‌ని జీవిత క‌థ ఆధారంగా ఓ బ‌యోపిక్‌ని రూపొందించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలిసింది. ఆ గాయ‌ని ఎవ‌రు? ఏంటీ? అన్న విష‌యాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్టు చిత్ర వ‌ర్గాల స‌మాచారం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All