క్రియేటివిటికి వయసుతో పనిలేదు. శరీరం సహకరిస్తే చాలు అనుకున్నది ఏదైనా చేయగలం. ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు. గత కొంత కాలంగా డైరెక్షన్కు దూరంగా వుంటూ వస్తున్నారాయన. అద్దె గర్భం నేపథ్యంలో `వెల్కమ్ ఒబామా` చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకున్నారు.
ఆ తరువాత మరో చిత్రాన్ని తెరకెక్కించలేదు. గత రెండేళ్ల క్రితం బాలకృష్ణతో `ఆదిత్య369`కు సీక్వెల్గా `ఆదిత్య 999` చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తారని ప్రచారం జరిగింది. అయితే బాలయ్య కథలో మార్పులు చెప్పడం దానికి సమయం పట్టడంతో ఆ ప్రాజెక్ట్ సెట్స్పైకి రాకుండానే ఆగిపోయింది. దీంతో సింగీతం శ్రీనివాసరావు మరో కథపై వర్క్ చేయడం మొదలుపెట్టారట.
ప్రస్తుతం ఆ కథకు తుది మెరుగులు దిద్దుతున్నారట. ఓ గాయని జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఆ గాయని ఎవరు? ఏంటీ? అన్న విషయాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించనున్నారు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్టు చిత్ర వర్గాల సమాచారం.