Homeఎక్స్ క్లూసివ్దేవిశ్రీ పై ఆగ్రహంగా ఉన్న శివనాగులు

దేవిశ్రీ పై ఆగ్రహంగా ఉన్న శివనాగులు

singer sivanagulu fire on devisriprasadసంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ పై ఆగ్రహంగా ఉన్నాడు తెలంగాణ జానపద గాయకుడు శివనాగులు . ఈ గాయకుడికి దేవిశ్రీ పైన కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా …….. రంగస్థలం చిత్రం . రంగస్థలం చిత్రంలో ”ఆ గట్టునుంటావా …… ఈ గట్టు కోస్తావా ” అనే పాటని రంగస్థలం చిత్రం కోసం జానపద గాయకుడు శివనాగులు చేత పాడించారు అలాగే ఆల్బమ్ లో కూడా శివనాగులు పేరే వేశారు అంతేకాదు ఆ పాట కూడా సూపర్ హిట్ అయ్యింది దాంతో శివనాగులు చాలా సంతోషపడ్డాడు .

కట్ చేస్తే సినిమా విడుదల అయ్యాక చూస్తే శివనాగులు పాడిన పాట కాకుండా దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాటని ఉంచారు సినిమాలో దాంతో శివనాగులు తీవ్ర నిరాశకు గురయ్యాడు . నేను పాడిన పాట సూపర్ హిట్ అయినప్పటికీ నా గాత్రాన్ని ఉంచకుండా దేవిశ్రీ గాత్రం ఉంచడం ఏంటి అని ఆశ్చర్య పోయాడు అయితే కనీసం ఈ విషయాన్నీ అతడికి ముందుగా చెప్పినా బాగుండేది అని ఫీల్ అవుతున్నాడు శివనాగులు . నిజమే కదా ! శివనాగులు పాడిన పాటని కొన్ని కారణాల వల్ల ఉపయోగించు కోలేక పోతున్నామంటూ ముందుగానే చెబితే బాగుండేది . అలా చేసి ఉంటే ఈ గోల ఉండేది కాదు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All