తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీస్ని కరోనా వణికిస్తోంది. ఈ మూడు భాషలకు చెందిన నటీనటులు, దర్శకనిర్మాతలు, గాయనీ గాయకులు కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. తాజాగా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా వుంది. ఆయనకు వెంటిలేటర్పై వుంచి చికిత్స అందిస్తున్నారు.
చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. రోజు రోజుకీ ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇదిలా వుంటే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడానికి, బాలుకు కరోనా సోకడానికి గాయని మాళవిక కారణం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. దీనిపై మాళవిక ఘాటుగా స్పందించింది. తనపై వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ మాళవిక ఓ వీడియోని రిలీజ్ చేసింది. తనపై ఓ ఫేక్ వాట్సాప్ మెసేజ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోందని, కరోనా పాజిటివ్ అని తెలిసి కూడా తను ఇటీవల బాలు పాల్గొన్న షోలో పాల్గొన్నానని, ఆ కారణంగానే బాలు గారికి కరోనా సోకిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు అని మండి పడింది.
రామోజీ ఫిల్మ్ సిటీలో ఎస్పీబీ పాల్గొనగా జూలై 30, 31న స్పెషల్ ఎపిసోడ్ చిత్రీకరణ జరిగింది. ఇందులో జూలై 30న హేమచంద్ర, అనుదీప్, లిప్సిక, ప్రణవి పాల్గొన్నారు. 31న కారుణ్య, దామిని, సత్య యామిని, వాస పావనితో పాటు తాను పాల్గొన్నానని, తనతో పాటు తన సిస్టర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొందంటూ ప్రచారం చేస్తున్నారని, అందులో ఎలాంటి వాస్తవం లేదని, టీమ్లోని కొంత మందికి కరోనా పాజిటివ్ అని తెలిసిందని, ఆ తరువాత ఆగస్టు 5న బాలు గారికి పాజిటివ్ అని తెలిపారని, ఆ తరువాత ఆగస్టు 8న తనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయి్యందిని మాళవిక తెలిపింది. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కరోనా సోకి బాధలో వుంటే తనపై అసత్య ప్రచారం చేయడం బాధా వుందని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు ఈ సందర్భంగా మాళవిక స్పష్టం చేసింది.