దేశ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఎవరికి ఎప్పుడు పాజిటివ్ అని రిపోర్ట్ వస్తుందా? అని జనం ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని బిక్కి బిక్కుమంటూ కాలాన్నివెల్లదీస్తున్నారు. ఓ పక్క కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నివారణ చర్యలు చేపడుతున్నా వైరస్ మాత్రం ప్రబలుతూనే వుంది. ఇటలీలో ఉగ్రరూపం దాల్చుతోంది. సినిమా వాళ్లు కూడా ప్రభుత్వానికి అండగా నిలుస్తూ షూటింగ్లు నిరవదికంగా బంద్కు పిలుపునిచ్చారు.
షూటింగ్లే కాకుండా రిలీజ్లని కూడా వాయిదా వేశారు. ప్రజలకి అవగాహన కల్పిస్తూ పలు వీడియోలని రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా వుంటే హాలీవుడ్ బాంగ్ గాళ్ కరోనా బారిన పడిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా బాలీవుడ్లో ఓ కరోనా బాదితురాలు బయటపడటంతో సినీ వర్గాల్లో భయందోళనలు మొదలయ్యాయి. సన్నీలియోన్ నటించిన `బేబీడాల్..` గీతాన్ని ఆలపించిన సింగర్ కనిక కపూర్ కరోనా బారిన పడింది.
ఇటీవల అనుమానం రావడంతో ఇటీవల ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. గత ఆదివారం కనిక కపూర్ యూకే నుంచి ఇండియా వచ్చింది. తన ప్రయాణంలో కరోనా వైరస్ సోకిన వారిని తనకు తెలియకుండానే కనిక కలవ వచ్చిని. ఆ కారణంగానే ఆమెకు కరోనా సోకిందని ముంబై వర్గాలు చెబుతున్నాయి. షాకింగ్ విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఆమె కలిసిన వారికి కూడా కరోనా సోకి వుండవచ్చని డాక్టర్లు చెప్పడం పలువురిని షాక్కు గురిచేస్తోంది.