సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి చుట్టూ రోజుకో ట్విస్ట్ బయటికి వస్తోంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ కేసుని నార్కోటిక్స్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో, ఈడీ, సీబీఐ వివిధ కోణాల్లో దర్యాప్తుని ముమ్మరం చేశాయి. సుశాంత్ మృతికి డ్రగ్స్కి రియాకి దగ్గరి సంబంధం వుండటంతో ఎన్సీబీ అధికారులు రంగంలోకి దిగడం రియాని అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టడంతో రోజుకో సంచలన విషయం బయటపడుతోంది.
ఈ కేసు విచారణలో భాగంగా తాజాగా సీబీఐ సుశాంత్ స్నేహితుడు సిద్ధార్ధ్ పితానీని ప్రశ్నించింది. విచారణలో భాగంగా సిద్ధార్ధ్ పితానీ .. సుశాంత్ మృతికి కొన్ని రోజుల ముందు ఏం జరిగిందో వెల్లడించినట్టు తెలిసింది. సుశాంత్ ఆత్మహత్యకు ముందు ఆయన మేనేజర్ దిషా సాలియాన్ ఆత్మ హత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే దిష మృతి తరువాత సుశాంత్ చాలా భయపడ్డారట. తనని కూడా చంపేస్తారని సుశాంత్ తనకు రోజూ చెబుతూ కంగారుపడేవాడని సిద్ధార్ట్ పితానీ సంచలన విషయాన్ని బయట పెట్టి నట్టు సమాచారం.
దీంతో పాటు తన సెక్యూరిటీని కూడా పెంచుకోవాలని అనుకున్నాడని సిద్ధార్ధ్ సీబీఐ ఎదుట చెప్పినట్టు పలు జాతీయ మీడియాల్లో కథనాలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ గురించి కూడా షాకింగ్ విషయాల్ని వెల్లడించినట్టు తెలిసింది. రియా సుశాంత్కి సంబంధించిన పర్సనల్ ల్యాప్లాప్, హార్డ్ డ్రైవ్ని తీసుకువెళ్లిందని సిద్ధార్ధ్ సీబీఐకి వెల్లడించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే సుశాంత్ మాజీ మేనేజర్ అంకిత్ ఆచార్య ఎన్సీబీ విచారణలో సంచలన విషయాన్ని బటయట పెట్టినట్టు తెలిసింది. అంకిత్ది ఆత్మ హత్య కాదని, అతనిది అథ్యేనని వెల్లడించినట్టు సమాచారం.