రీసెంట్ గా కరోనా నుండి క్షేమంగా బయటపడ్డ శృతి హాసన్..మెగా ఛాన్స్ కొట్టేసింది. క్రాక్ తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్న శృతి..ఆ తర్వాత వకీల్ సాబ్ తో మరో హిట్ అందుకుంది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ 107 మూవీ తో పాటు ప్రభాస్ సరసన సలార్ మూవీ లో నటిస్తుంది. ఈ రెండు సెట్స్ ఫై ఉండగానే మెగాస్టార్ చిరంజీవి 154 మూవీ లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.
ఉమెన్స్ డే సందర్బంగా ఈ విషయాన్నీ అధికారిక ప్రకటన చేసారు చిత్ర యూనిట్. ఈ విషయాన్ని ప్రకటించడానికి ఉమెన్స్ డే కంటే ఇంకా మంచి రోజు ఎప్పుడు ఉంటుందని చిరంజీవి పేర్కొన్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ యెర్నేని రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు జీకే మోహన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.