రీసెంట్ గా కరోనా నుండి క్షేమంగా బయటపడ్డ శృతి హాసన్..మళ్లీ సినిమా షూటింగ్ లతో బిజీ కాబోతుంది. క్రాక్ తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్న శృతి..ఆ తర్వాత వకీల్ సాబ్ తో మరో హిట్ అందుకుంది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ 107 మూవీ తో పాటు ప్రభాస్ సరసన సలార్ మూవీ లో నటిస్తుంది. ఈ రెండు సెట్స్ ఫై ఉండగానే మెగాస్టార్ చిరంజీవి 154 మూవీ లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో హీరోయిన్ గా పలువుర్ని అనుకున్నప్పటికీ , చివరకు మాత్రం శృతికే దక్కింది. అయితే ఈ సినిమాకు గాను శృతి తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ చిత్రానికి కోటిన్నర తీసుకుంటున్న ఈమె , చిరంజీవి దగ్గరికి వచ్చేసరికే రెండు కోట్లు డిమాండ్ చేస్తుందట.
మాములుగా అయితే బ్యానర్ బట్టి , లేదా హీరో , డైరెక్టర్ ను బట్టి ఇంకాలేదంటే కాల్ షీట్స్ బట్టి హీరోయిన్లు రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తుంటారు. కానీ శృతి మాత్రం గోపీచంద్ తో ఆల్రెడీ పలు సినిమాలు చేసి ఉండడం..తన ప్రతి సినిమాలో శృతినే హీరోయిన్ గా తీసుకోవడం వల్ల బాలయ్య సినిమా కు రెమ్యూనరేషన్ తక్కువగా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక చిరంజీవి తో ఫస్ట్ టైం చేస్తుంది..అందుకే ఆలా డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈమె అడిగినదానికి మైత్రి వారు కూడా ఓకే చెప్పారట.