హాయిగా హీరోయిన్ గా కెరీర్ ని ఎంజాయ్ చేయాల్సింది పోయి సినిమాలను గాలికి వదిలేసి బోయ్ ఫ్రెండ్ తో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది అందాల భామ శృతి హాసన్ . తెలుగు , తమిళ , హిందీ బాషలలో నటిస్తున్న ఈ భామ చేతిలో ప్రస్తుతం ఒక్క శభాష్ నాయుడు చిత్రం మాత్రమే ఉంది దాంతో బోయ్ ఫ్రెండ్ తో కావలసినంత సమయం ఉండటంతో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు . అసలు ఒకదశలో అయితే మైఖేల్ కోర్సెల్ ని శృతి వివాహం చేసుకుందని కూడా పుకార్లు షికారు చేసాయి .
ఎక్కడికి వెళ్లినా జంటగా వెళుతుండటంతో ఈ పుకార్లు ఎక్కువయ్యాయి అయితే ఎంతగా పుకార్లు వస్తున్నప్పటికీ ఈ భామ మాత్రం డోంట్ కేర్ అన్నట్లుగానే వ్యవహరిస్తోంది . చెన్నై కి ముంబై కి ముంబై నుండి విదేశాలకు చక్కర్లు కొడుతున్న ఈ భామ కెరీర్ ని ఇక గాలికి వదిలేసినట్లే అని అంటున్నారు .
- Advertisement -