Homeటాప్ స్టోరీస్శ్రియ వినూత్న ఛాలెంజ్‌‌!

శ్రియ వినూత్న ఛాలెంజ్‌‌!

శ్రియ వినూత్న ఛాలెంజ్‌‌!
శ్రియ వినూత్న ఛాలెంజ్‌‌!

క‌రోనా విళ‌య‌తాండ‌వం చేస్తున్న వేళ హీరోయిన్‌ శ్రియ  రూ. 200 చెల్లిస్తే త‌న‌తో క‌లిసి డ్యాన్స్ (వీడియో కాల్‌) చేసే అవ‌కాశం ల‌భిస్తుంద‌ని ఆమె పేర్కొన్నారు. ర‌ష్యా‌కు చెందిన టెన్నిస్ ప్లేయ‌ర్ ఆండ్రూ కోశ్చివ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది శ్రియ‌. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ స్పెయిన్‌లోని బార్సీలోనాలో వుంటున్నారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఇంటి ప‌ట్టునే వుంటున్న శ్రియ నిత్యం భ‌ర్త‌తో క‌లిసి అభిమానుల‌తో ట‌చ్‌లో వుంటున్నారు.

ఓ మంచి ప‌ని కోసం ఆమె విరాళాలు సేక‌రించ‌డం మొద‌లుపెట్టారు. లాక్‌డౌన్ కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్న పేద‌లను ఆదుకోవ‌డం కోసం ఓ స్వ‌చ్ఛంద సంస్థ‌తో క‌లిసి ఆమె ప‌నిచేస్తున్నారు. ది కైండ్‌నెస్ ప్రాజెక్ట్ , చెన్నై టాస్క్‌ఫోర్స్ బృందాల‌తో క‌లిసి శ్రియ ప‌నిచేస్తున్నారు.

- Advertisement -

ఈ విష‌యాన్ని ఆమె ఇన్‌స్టా వేదిక‌గా వెల్ల‌డించారు. కోవిడ్ బాధితుల కోసం  విరాళాల సేక‌ర‌ణ‌కు ది కైండ్‌నెస్ ప్రాజెక్ట్ , చెన్నై టాస్క్‌ఫోర్స్ బృందాల‌తో క‌లిసి ప‌నిచేస్తున్నాను. నిరాశ్ర‌యులైన వృద్ధులు, రోజు వారీ కూలీలు, అనాథ‌లు, విక‌లాంగుల శ్రేయ‌స్సుకు ఈ విరాళాలు వినియోగించ‌బోతున్నాం. thekindnessproject.in కు రూ. 200 విరాళం చెల్లించి మీ రిసిప్ట్‌ను ఈమెయిల్ చేయండి.. అంటూ శ్రియ ఇన్ స్టా వేదిక‌గా ఓ వీడియోని షేర్ చేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All