Homeటాప్ స్టోరీస్ప్రభాస్ గెస్ట్ హౌజ్ ని సీజ్ చేసిన అధికారులు

ప్రభాస్ గెస్ట్ హౌజ్ ని సీజ్ చేసిన అధికారులు

Shocking Prabhas guest house seized యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు తెలంగాణ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది . శేరిలింగం పల్లి లోని ప్రభాస్ గెస్ట్ హౌజ్ ని తెలంగాణ అధికారులు సీజ్ చేసారు . ప్రభాస్ గెస్ట్ హౌజ్ ని ఎందుకు సీజ్ చేసారో తెలుసా ……. అది ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన కట్టడం కాబట్టి . ఆమేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రభాస్ గెస్ట్ హౌజ్ కు తాళం వేసి సీజ్ చేస్తున్నట్లు ఓ ప్రకటన అంటించారు . దాంతో ప్రభాస్ తో పాటుగా ప్రభాస్ కుటుంబం కూడా షాక్ కి గురయ్యింది .

శేరిలింగం పల్లి లోని రాయదుర్గం పాయెగా 46 సర్వే నెంబర్ లో ప్రభాస్ 2200 గజాలలో ఓ గెస్ట్ హౌజ్ నిర్మించుకున్నాడు . అయితే అది ప్రభుత్వ స్థలమని ఇతరులు అన్యాక్రాంతం చేసి ప్రభాస్ కు అమ్మారని అందుకే తిరిగి ప్రభుత్వ భూమిని మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని అంటున్నారు . తన గెస్ట్ హౌజ్ ని అధికారులు సీజ్ చేయడంతో దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రభాస్ . రెగ్యులరైజ్ చేస్తే తిరిగి ప్రభాస్ వశం అవుతుంది లేదంటే ఆ కట్టడాన్ని అధికారులు కూల్చేస్తారు .

- Advertisement -

English Title: Shocking :Prabhas guest house seized

Shocking :Prabhas guest house seized 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All