యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు అయిన కేటీఆర్ ని కలవడం సంచలనంగా మారింది . ఎన్టీఆర్ అక్క నందమూరి సుహాసిని ఇటీవలే తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున కూకట్ పల్లి లో పోటీ చేసి దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే . అయితే ఆ సమయంలో ప్రచారం నిర్వహించకుండా గమ్మున ఉన్న ఎన్టీఆర్ తాజాగా జరిగిన ఓ ప్రయివేట్ ఫంక్షన్ లో మాజీ మంత్రి కేటీఆర్ ని కలవడం సంచలనంగా మారింది .
ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . కేటీఆర్ , ఎన్టీఆర్ లతో పాటుగా మరో ఇద్దరు కలిసి ఉన్న ఫోటో సంచలనం సృష్టిస్తోంది . రాజకీయంగా చూస్తే ఇద్దరు కూడా ప్రత్యర్థులే ! కానీ ఎన్టీఆర్ రాజకీయాలను వదిలేసి కేవలం సినిమాల మీదనే ద్రుష్టి పెట్టాడు . ఎన్టీఆర్ రాజకీయాలను పక్కన పెట్టినప్పటికీ , అక్క కోసం ప్రచారం చేయలేని హీరో ఓ ఫంక్షన్ లో మాత్రం కేటీఆర్ ని కలుసుకోవడం నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి . ఎన్టీఆర్ మదిలో చంద్రబాబు పట్ల , బాలయ్య బాబాయ్ పట్ల ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఎవరికి తెలుసు ?
- Advertisement -
English Title : Shocking ; Jr NTR with KTR
- Advertisement -