Homeటాప్ స్టోరీస్లాక్‌డౌన్ వేళ తార‌ల ఫొటో షూట్‌లు!

లాక్‌డౌన్ వేళ తార‌ల ఫొటో షూట్‌లు!

లాక్‌డౌన్ వేళ తార‌ల ఫొటో షూట్‌లు!
లాక్‌డౌన్ వేళ తార‌ల ఫొటో షూట్‌లు!

ఓ ప‌క్క దేశ వ్యాప్తంగా క‌రోనా విళ‌య‌తాండ‌వం చేస్తుంటే కొంత మంది నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తున్నారు. బాధ్య‌తారాహిత్యంగా వ్యవ‌రిస్తున్నారు. బాధ్య‌త‌గ‌ల సెల‌బ్రిటీలుగా వుంటూ ప‌ది మందికి ఆద‌ర్శంగా నిల‌వాల్సింది పోయి స‌మాజానికి ఇబ్బంది క‌రంగా ప‌రిణ‌మిస్తున్నారు. అడివి శేష్ న‌టించిన `గూఢ‌చారి` చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైంది శోభితా దూళిపాళ్ల‌. ఆ త‌రువాత తెలుగు చిత్రాల్లో క‌నిపించ లేదు.

తాజాగా లాక్‌డౌన్ వేళ ఫొటో షూట్‌ల‌తో హీటెక్కిస్తోంది. అదేంటి లాక్ డౌన్ స‌మ‌యంలో ఫొటో షూట్లేంట‌ని నెటిజ‌న్స్ ప్ర‌శ్నిస్తే మాత్రం అవి సెల్ఫీ టైమ‌ర్‌తో తీసిన ఫొటోల‌ని  చెప్పింది. కానీ నెటిజ‌న్స్ మాత్రం త‌ను చెప్పింది అబ‌ద్ధ‌మ‌ని వాదించ‌డం మొద‌లుపెట్టారు దీంతో  మ‌న‌స్తాపానికి గురైన శోభిత అస‌లు ఫొటో షూట్ ఎలా ఇరిగింది. త‌ను సెల్ఫ్ టైమ‌ర్‌తో ఎలా ఫొటోల‌కు పోలిజిచ్చింది వివ‌రించే ప్ర‌య‌త్నం చేసింది.

- Advertisement -

త‌ను టెర్రాస్ పై సెల్ఫీ టైమ‌ర్ కెమెరాతో ఫొటోలు తీసుకుంటుండ‌గా పైకి వ‌చ్చిన ఓ వ్య‌క్తి త‌ను తీసిపెడ‌తాన‌ని చెప్పి ఫొటోలు తీశారు. ఆ త‌రువాత అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. అయితే అత‌ను తీసిని ఏ ఫొటోనీ తాను మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ కోసం పంపించ‌లేద‌ని, తాను స్వ‌యంగా తీసుకున్న ఫొటోనే పంపించాన‌ని చెప్పుకొచ్చింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All