`అర్జున్రెడ్డి` చిత్రం తెలులో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. హిందీలో, తమిళంలోనూ రీమేక్ చేయబడ్డి ఈ సినిమా దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. ఈ చిత్రంలో నటించిన విజయ్ దేవరకొండని స్టార్ని చేసింది. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ పాపులర్ అయ్యేలా చేసింది. ఇదే చిత్రంతో ఉత్తరాది భామ షాలిని పాండే హీరోయిన్గా పరిచయమైంది. కథానాయికగా క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకుంటూ వరుస చిత్రాల్లో నటిస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ బిజీగా మారింది.
తాజాగా బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్ని సొంతం చేసుకుంది. రణ్వీర్సింగ్ హీరోగా మనీష్శర్మ `జయేష్భాయ్ జోర్దార్` పేరుతో ఓ సినిమా తెరపైకి రాబోతోంది. ఈ చిత్రం ద్వారా షాలిని పాండే బాలీవుడ్ బాటపడుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే తెలుగులో వరుస క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్న షాలిని పాండేపై తాజాగా క్రిమినల్ కేసు నమోదైనట్టు సమాచారం. తమిళ సంగీత దర్శకుడు, హీరో విజయ్ ఆంటోనీ హీరోగా `అగ్ని సిరాగుగల్` సినిమా చేయాలనుకున్నారు. ఇందు కోసం షాలిని పాండేని హీరోయిన్గా ఫైనల్ చేసుకున్నారు.
అగ్రిమెంట్పై సంతకాలు కూడా పూర్తయ్యాయట. నవీన్ డైరెక్టర్. అరుణ్ విజయ్ కీలక పాత్రలో నటింస్తున్నారు. అయితే ఈ చిత్ర షూటింగ్లో కేవలం ఏడు రోజులు మాత్రమే పాల్గొన్న షాలిని పాండే ఆ తరువాత షూటింగ్కి డుమ్మా కొట్టిందట. ఎంతకీ స్పందించకపోవడంతో ఆ స్థానంలో అక్షరా హాసన్ని తీసుకున్నారు. అయితే అగ్రిమెంట్ ప్రకారం నటించనందుకు గానూ నిర్మాతలు తమిళ ప్రొడ్యూసర్స్ సంఘంలో ఫిర్యాదు చేశారట. అంతే కాకుండా షాలినిపై క్రిమినల్ కేస్ పెట్టినట్టు తాజాగా వార్తలు షికారు చేస్తున్నాయి. బాలీవుడ్ అవకాశం కారణంగానే విజయ్ ఆంటోని చిత్రానకిషాలిని పాండే హ్యిండిచ్చిందని ప్రచారం జరుగుతోంది. షాలిని మాత్రం ఇప్పటి వరకు ఈ వార్తలపై స్పందించలేదు.