Homeటాప్ స్టోరీస్అమెరికాని వణికించిన సెప్టెంబర్ 11 కు 17 ఏళ్ళు

అమెరికాని వణికించిన సెప్టెంబర్ 11 కు 17 ఏళ్ళు

September 11 attacksసరిగ్గా ఇదే రోజున 17 ఏళ్ల క్రితం కిరాతకమైన తీవ్రవాద సంస్థ ఆల్ ఖైదా అగ్రరాజ్యం అమెరికాని నిలువెల్లా వణికిపోయేలా చేసింది . 2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్ లో ఏకంగా విమానాలను హైజాక్ చేసి నాలుగు చోట్ల మారణహోమం సృష్టించారు . విమానాలను హైజాక్ చేసి వాటిని మానవబాంబులుగా మార్చి ట్విన్ టవర్స్ పై దాడి చేసారు . నాలుగు విమానాలు కూడా స్వల్పకాలిక తేడాలో మారణహోమం సృష్టించాయి . ప్రపంచంలోనే అత్యంత పెద్దవైన ట్విన్ టవర్స్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆ దుమ్ము దూళిలో వేలాది ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి . ఒక్కసారిగా విమానాలతో దాడి చేయడంతో అగ్రరాజ్యం ఖిన్నురాలైంది .

ఆల్ ఖైదా జరిపిన దాడిలో 2996 మంది చనిపోగా ,2977 మంది క్షతగాత్రులయ్యారు ఇక విమానాలను హైజాక్ చేసింది , దాడులకు పాల్పడింది మొత్తం 19 మంది . ఈ సంఘటన జరిగి 16 ఏళ్ళు పూర్తికాగా ఈరోజుతో 17 వ సంవత్సరం లోకి అడుగుపెట్టింది . విమానాల దాడుల తర్వాత అగ్రరాజ్యం అమెరికా ఆల్ ఖైదా ని అంతం చేయడానికి ఎన్నో వ్యూహాలు పన్నింది దాని ఫలితంగా ఒసామా బిన్ లాడెన్ ని దాక్కున్న పాకిస్థాన్ లోనే చంపేసింది . ఇప్పటికి కూడా సెప్టెంబర్ 11 అంటే అమెరికా పౌరులు నిలువెల్లా వణికిపోయేలా చేస్తోంది , అంతటి తీవ్ర ప్రళయాన్ని సృష్టించింది ఆల్ ఖైదా .

- Advertisement -

English Title: September 11 attacks

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All