టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు రావి కొండల రావు మృతి చెందారు.గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బేగంపేట్ లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్సపొందుతూ మంగళవారం కన్ను మూశారు. 1958లో ‘శోభ’ అనే చిత్రంతో కొండలరావు సినీ ప్రస్థానం మొదలైంది.
1932, ఫిబ్రవరి 11 న శ్రీకాకుళం లో. కొండలరావు జన్మించారు. ఆరు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 600 లకు పైగా సినిమాలలో నటించారు. తన విలక్షణ మైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ప్రముఖనటి రాధాకుమారి ని ఆయన వివాహం చేసుకున్నారు. రాధాకుమారి 2012లో ఆమె మృతి చెందారు. రావి కొండలరావు మృతి పట్ల స్టార్ హీరో, జనసేన అధినేత పవన్కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
- Advertisement -