కంటెంట్ వున్న కథల్ని ఎంచుకుంటూ సరికొత్త చిత్రాలతో ముందుకు సాగుతున్నారు యంగ్ హీరో సత్యదేవ్. అద్భుతమైన వాయిస్తో అంతే అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటూ వరుసగా విభిన్నమైన చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `గుర్తుందా సతీకాలం`. మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. నాగశేఖర్ దర్శకత్వంలో నాగశేఖర్ మూవీస్ బ్యానర్పై భావన, రవి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో హీరో సత్యదేవ్, దర్శకనిర్మాత నాగశేఖర్, సంగీత దర్శకుడు కాలభైరవ, సినిమాటోగ్రాఫర్ సత్య హెగ్డే చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సత్యదేవ్ మాట్లాడుతూ ` ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాత నాగశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాలో నా పాత్ర చాలా ఎమోషనల్గా సాగుతుంది. తొలిసారి తమన్నాగారితో కలిసి నటించడం ఆనందంగా వుంది. కాలభైరవ ఈ చిత్రానికి అద్భుతమైన ట్యూన్స్ని, నేపథ్య సంగీతాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను. ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ నా సినిమాల్ని ఆదరిస్తున్నా అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను` అన్నారు.
టైటిల్కు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించిందని, ఈ చిత్రాన్ని ప్రకటించిన వెంటనే మార్కెట్లో వచ్చిన స్పందన మా బాధ్యతను పెంచిందని, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా వుంటుంది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా మొదలుపెట్టామని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడు నాగశేఖర్ వెల్లడించారు.