Homeప్రెస్ నోట్స్టాలీవుడ్ లో మొదలైన సరోగసీ చిత్రం

టాలీవుడ్ లో మొదలైన సరోగసీ చిత్రం

టాలీవుడ్ లో మొదలైన సరోగసీ చిత్రం
టాలీవుడ్ లో మొదలైన సరోగసీ చిత్రం

ఒకప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే విచిత్రంగా చూసేవాళ్లు. ఏదో తయారుచేసిన మనిషిని చూసినట్లుగా చూసేవాళ్లు. అప్పట్లో ఆపరేషన్ చేసి డెలివరీ చేయడాన్నే వింతగా చూసిన రోజులూ ఉన్నయ్. ఇప్పుడు అలా కాదు. పిల్లల్ని కనాలంటే..ప్రగ్నెంట్ కావాల్సిన పనేలేదు.

జనంలో అవేర్నెస్ పెరిగింది. సరోగసీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు జనాలు. నిన్న మొన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా సరోగసీ ద్వారా బిడ్డకి తల్లైంది. ఇక ఇదే కాన్సెప్ట్ లపై ఫారిన్ లాంగ్వేజుల్లో సినిమాలు కూడా వచ్చేవి..జనం కాస్త విచిత్రంగా చూసేవారు.

- Advertisement -

ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ పై ఇండియన్ క్రియేటర్లు కూడా ఫోకస్ చేస్తున్నారు. మన తెలుగులో కూడా యంగ్ డైరెక్టర్స్ అనిల్ పురేటి, స్రవంతి మురళి సులోచన సమయం ఆసన్నం అనే చిత్రాన్ని అనౌన్స్ చేశారు ఆ మధ్య. దర్శక ద్వయంగా రాబోతున్న సులోచన సమయం ఆసన్నం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అనుకున్న టైం ప్రకారం సమ్మర్ లో పూర్తి చేస్తామంటోంది యంగ్ టీమ్.

బిగ్ బాస్ ఫేమ్ శ్వేత వర్మ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఈ మూవీలో కన్నడ హీరో అర్జున్ ఆర్య, సహర్ క్రిష్ణన్, దిలీప్ సల్వాడీ మెయిన్ లీడ్స్ గా చేస్తున్నారు. డీఓపీగా కేవీపీ వర్క్ చేస్తున్నారు. ఇద్దరు డైరెక్టర్ల క్రియేటివ్ మేకింగ్ లో రాబోతున్న సినిమాగా ఇంట్రస్ట్ కలిగిస్తోంది సులోచన సమయం ఆసన్నం. యూనిక్ సబ్జెక్ట్ కావడంతో..ఒకేసారి మూడు భాషల్లో చిత్రీకరిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All