సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోయే తాజా చిత్రం సర్కారు వారి పాట. బ్యాంకింగ్ వ్యవస్థ మీద విమర్శగా ఈ చిత్ర కథ ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్ర కథ ప్రకారం మెజారిటీ భాగం యూఎస్ లో జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో చిత్ర షూటింగ్ ను యూఎస్ లో మొదలుపెట్టి అక్కడే దాదాపు 2 నెలల పాటు షూటింగ్ చేసి మెజారిటీ భాగం ఫినిష్ చేయాలని మొదట భావించారు. అయితే అనుకోకుండా యూఎస్ లో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది.
రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పరశురామ్ సర్కారు వారి పాట స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ భాగం యూఎస్ లో కాకుండా ఇండియాలోనే షూటింగ్ చేసేలా స్క్రిప్ట్ లో మార్పుల కోసం ప్రయత్నిస్తున్నాడట. అప్పుడైతే చిన్న షెడ్యూల్ యూఎస్ లో పూర్తి చేసి మిగతా భాగం ఇండియాలోనే షూట్ చేయవచ్చని భావిస్తున్నాడు.
అయితే ఈ వార్తలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.