మహేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజుతో కలిసి అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. లేడీ అమితాబ్గా పేరు తెచ్చుకున్న విజయశాంతి కొంత విరామం తరువాత ఈ సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాతలలో ఒకరైన అనిల్ సుంకర మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించి పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
140 రోజుల్లో ఎలాంటి అవాంతరాలు ఎదురవకుండా ఈ చిత్రాన్ని పూర్తి చేశామని, సినిమాకు పరిచేసిన, ఇందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్ గర్వపడేలా ఈ సినిమా వచ్చిందని, ప్రేక్షకులతో పాటు తాము కూడా సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఎదురుచూస్తున్నామని స్పష్టం చేశారు. మహేష్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుందని, 13 ఏళ్ల విరామం తరువాత విజయశాంతి నటించిన చిత్రమిదని, ఆమె ఈ చిత్రం కోసం అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని, ఈ సంక్రాంతికి పెద్ద పండగ లాంటి సినిమా అవుతుందని వెల్లడించారు.
మహేష్, విజయశాంతి మధ్య వచ్చే సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి విజిల్స్, క్లాప్స్ పడతాయి. కొన్ని చోట్ల వీరి మధ్య వచ్చే సన్నివేశాలకు ప్రేక్షకులు కన్నీళ్లు పెడతారు. ఆర్మీ మేజర్ రాయలసీమకు వచ్చి ఏం చేశాడన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. భారతీయ సినీ చరిత్రలోనే ఈ పాయింట్తో ఏ సినిమా రాలేదు. సినిమాలో ట్రైయిన్ ఎపిసోడ్ 30 నిమిషాల పాటు సాగుతుందని, ఇది సినిమాకు ప్రధాన హైలైట్గా నిలుస్తుందని అనిల్ సుంకర స్పష్టం చేశారు. `సరిలేరు నీకెవ్వరు` ఇండియన్ ఆర్మీకి మేమిస్తున్న ఓ గ్రేట్ ట్రిబ్యూట్. జనవరి 5న జరగబోయే ప్రీ రిలీజ్ ఈ వెంట్కి హీరో మహేష్ హోస్ట్గా వ్యహరించబోతున్నారు. తన సినిమాకి తానే హోస్ట్ గా వ్యవహరించడం ఇదే తొలిసారి అని వెల్లడించారు.