రేపు శరభ చిత్రం విడుదల అవుతోంది. దర్శకత్వ శాఖలో సుధీర్ఘ కాలం పనిచేసిన యన్. నరసింహారావు దర్శకత్వంలో అశ్విన్ కుమార్ సహదేవ్ నిర్మించిన చిత్రం ఈ శరభ. ఆకాష్ కుమార్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో మిస్తీ చక్రవర్తి హీరోయిన్ గా నటించగా సీనియర్ నటి , మాజీ హీరోయిన్ జయప్రద కీలక పాత్ర పోషించింది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. 20 కోట్ల బడ్జెట్ తో కొత్త హీరో అంటే పెద్ద సాహసమనే చెప్పాలి, అయితే కథ పక్కాగా రావడంతో ఈ సాహసానికి పూనుకున్నాడు నరసింహారావు.
దర్శకుడిగా నరసింహారావుకు ఇది కొత్త సినిమా కానీ కథకుడిగా మాత్రం కాదు ఎందుకంటే తమిళ బ్లాక్ బస్టర్ కత్తి సినిమాకు కథ అనధికారికంగా అందించింది ఈ నరసింహారావే ! నిర్మాతలు కొత్త వాళ్ళు అయినప్పటికీ నరసింహారావు చెప్పిన కథ నచ్చి భారీ బడ్జెట్ పెట్టడానికి ముందుకు వచ్చారు. కట్ చేస్తే రేపు ప్రపంచ వ్యాప్తంగా శరభ చిత్రం విడుదల అవుతోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పై చాలా ఆశలు పెట్టుకున్నారు ఆ చిత్ర బృందం. చిన్న చిత్రంగా వచ్చే సినిమాలు భారీ విజయాలు సాధించిన చిత్రాలు కోకొల్లలు . వాటి లాగే శరభ హిట్ కావాలని , అవుతుందని ఆశిస్తున్నారు శరభ బృందం. అయితే 20 కోట్లు వసూల్ చేసి దుమ్ము లేపుతుందా ? లేదా ? అన్నది రేపు తేలిపోనుంది.
English Title: Sarabha unit hopes on succes