సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్కమ్ములని జీహెచ్ ఎంసీ పారిశుద్య కార్మికులు థ్రిల్ చేశారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఆవరణలో `థ్యాంక్యూ శేఖర్ కమ్ముల గారు` అంటూ ప్లా కార్డులు ప్రదర్శించి అభినందనలు తెలియజేశారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో పారిశుద్య కార్మికులకు బాదం పాలు, మజ్జిగ ప్యాకెట్లని శేఖర్ కమ్ముల అందించిన విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
అందుకు తమ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించినందుకు గానూ శేఖర్ కమ్ములకు కార్మికులు వినూత్నంగా అభినందనలు తెలియజేయడం ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై శేఖర్ కమ్ముల స్పందించారు. `గాంధీ ఆసుపత్రి ఆవరణలోని పారిశుద్య కార్మికులు చేసిన పని చూసి ఆశ్చర్యపోయాను. వారు చేస్తున్నదానితో పోలిస్తే నేను చేసింది చాలా తక్కువ. ఇది నాకు అతి పెద్ద అవార్డుగా భావిస్తున్నాను` అన్నారు.
శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగచైతన్య, సాయి పల్లవి జంటగా `లవ్స్టోరీ` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. నారాయణ్దాస్ నారంగ్, పి. రామ్మోహన్రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరో 15 రోజులు షూటింగ్ బ్యాలెన్స్గా వుంది. లాక్డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడటంతో లాక్ డౌన్ తరువాత బ్యాలెన్స్ షూటింగ్ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.