Homeటాప్ స్టోరీస్మ‌ళ్లీ ఆనందీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో..

మ‌ళ్లీ ఆనందీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో..

మ‌ళ్లీ ఆనందీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో..
మ‌ళ్లీ ఆనందీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో..

విభిన్న‌మైన చిత్రాల‌తో త‌న‌కంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు యంగ్ హీరో సందీప్‌కిష‌న్‌. `నిను వీడ‌ని నీడ‌ను నేనే`, తెనాలి రామ‌కృష్ణ ఎల్ ఎల్ బి చిత్రాల‌తో మ‌ళ్లీ విజ‌యాల బాట ప‌ట్టారాయ‌న‌. సందీప్‌కిష‌న్ పుట్టిన రోజు నేడు. తాజాగా సందీప్‌కిష‌న్ న‌టిస్తున్న చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్‌`. డెన్నీస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. హాకీ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. పుట్టిన రోజు సంద‌ర్భంగా సందీప్‌కిష‌న్ కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు. ఆనందీ ఆర్ట్స్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై జెమిని కిర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. గురువారం ఈ చిత్రానికి సంబంధించిన న్యూస్‌ని బ‌ర్త‌డే విషెస్ తెలియ‌జూస్తూ వెల్ల‌డించారు.

- Advertisement -

గ‌తంలో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌, బీరువా చిత్రాలు రూపొందాయి. అందులో వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ సూప‌ర్ హిట్‌గా నిలిచింది. మూచ్చ‌ట‌గా మూడ‌వ‌సారి క‌లిసి మ‌రో సినిమాకు శ్రీ‌కారం చుడుతున్నారు. ఈ చిత్రం ద్వారా రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి భాను భోగ‌వ‌ర‌పు క‌థ అందిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All