`అర్జున్రెడ్డి`…ఈ మూవీ తెలుగులో సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. పాత్ బ్రేకింగ్ బ్లాక్ బస్టర్గా సంచలనం సృష్టించిన ఈ చిత్రంతో స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారు సందీప్రెడ్డి వంగ. ఇదే చిత్రాన్ని హిందీలో `కబీర్సింగ్` పేరుతో తెర కెక్కించి బాలీవుడ్లోనూ తన సత్తాను చాటారు. ప్రశ్నార్థకంగా మారిన షాహీద్కపూర్ కెరీర్ని మలుపు తిప్పింది.
దీంతో బాలీవుడ్లో సందీప్రెడ్డి వంగ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. స్టార్ హీరోలంతా అతనితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం కూడా జరిగింది. వారిని పక్కన పెట్టి `డెవిల్` పేరుతో ప్రభాస్తో సందీప్ వంగ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని, త్వరలోనే ప్రకటన వుంటుందని వార్తలు షికారు చేశాయి కూడా. అయితే నాగ్ అశ్విన్తో ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించడంతో సందీప్రెడ్డి వంగ నెక్స్ట్ సినిమా ఎవరితో అనే చర్చ మొదలైంది.
ఇదిలా వుంటే సందీప్రెడ్డి వంగకు సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ తమ బ్యానర్లో సినిమా చేయమని ఇటీవల అడ్వాన్స్ ఇచ్చారట. ప్రభాస్తో సినిమా చేయాలంటే మరో ఏడాది పాటు వేచి చూడాలి కాబట్టి సందీప్కు మలయాళ హిట్ చిత్రం `అయ్యప్పనుమ్ కోశియుమ్` చిత్రాన్ని రీమేక్ బాధ్యతల్ని అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఈ చిత్ర రీమేక్ రైట్స్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.