మహేష్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా సమ్మోహనం చిత్రాన్ని చేసాడు దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి . బాలీవుడ్ భామ అదితిరావు హైదరీ హీరోయిన్ గా నటించిన ఈ సమ్మోహనం ఈనెల 15న విడుదల కానుంది . ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మీడియా ముందుకు వచ్చిన ఇంద్రగంటి అసలు ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ ని అనుకున్నాడట ! అలాగే నాని తో కూడా చేయాలని అనుకున్నాడట ఎందుకంటే ఆ ఇద్దరిలో ఎవరైనా బాగుంటారు సరిగ్గా సరిపోతుందని అంటున్నాడు .
అయితే విజయ్ దేవరకొండ ఖాళీగా లేడు , అర్జున్ రెడ్డి సంచలన విజయం సాధించడంతో స్టార్ డం వచ్చి పడింది విజయ్ దేవరకొండ కు అంతే ……. అవకాశాలు వరుసపెట్టి వచ్చాయి దాంతో డేట్స్ ఖాళీ లేకుండా పోయాయి . ఇక నాని కూడా మరో రెండు సినిమాలు కమిట్ అయి ఉన్నాడు దాంతో ఆ అవకాశం సుధీర్ బాబు ని వరించింది . సినిమా నేపథ్యంలో తెరకెక్కిన సమ్మోహనం తప్పకుండా హిట్ అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి .